మొన్న కనిపించింది డూప్ కిమ్ జోంగా!

మొన్న కనిపించింది డూప్ కిమ్ జోంగా!
  • కిమ్ ఓల్డ్, లేటెస్ట్ ఫోటోల్లో పోలికలున్నట్లు బ్రిటన్ మాజీ ఎంపీ ట్వీట్
  • మళ్లీ కిమ్ హెల్త్ కండిషన్ మొదలైన అనుమానాలు

లండన్ : నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ హెల్త్ పై రకరకాల ఆరోపణలు వచ్చాయి. ఆయన కు సర్జరీ అయ్యిందంటూ, కోమాలోని వెళ్లారంటూ గత 20 రోజుల పాటు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలన్నింటికీ పుల్ స్టాఫ్ పెడుతూ కిమ్ జోంగ్ ఇటీవలే ఓ కెమికల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ లో ఫుల్ హెల్దీగా కనిపించారు. దీంతో కిమ్ ఆరోగ్యం పై వచ్చిన వచ్చినవన్నీ రూమర్సే అని అంతా భావించారు. కానీ బ్రిటన్ మాజీ ఎంపీ లూయిస్ మెన్స్ మాత్రం మళ్లీ కొత్త డౌట్ వ్యక్తం చేశారు. అసలు మొన్న కనిపించిన కిమ్ జోంగ్ ఉన్ అసలు కిమ్ కాదంటూ ఆయన డూప్ కావచ్చు అనే అనుమానాలు వ్యక్తమయ్యేలా ట్విట్టర్ల్ పోస్ట్ పెట్టారు. గతంలో కిమ్ ఉన్న కిమ్ ఫోటోలను…మొన్న కనిపించిన కిమ్ ఫోటోలను జత చేస్తూ ఈ రెండు ఫోటోల మధ్య చాలా తేడాలున్నాయని చెప్పారు. అసలు కిమ్ పళ్ల వరుసకు…మొన్న కనిపించిన కిమ్ పళ్ల వరుసకు తేడా ఉందని, హెయిర్ స్టైల్, ముక్కు, కళ్లు, బాడీ కలర్ ఇలా చాలా తేడాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఐతే ప్రస్తుతం కనిపిస్తున్న కిమ్ అసలు కిమ్ కాదని తాను వాదించనని పోలికలు తేడా ఉండటాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నానని లూయిస్ మెన్స్ చెప్పారు. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఈ డూప్ న్యూస్ వైరల్ గా మారింది. కిమ్ కూడా సెక్యూరిటీ రీజన్స్ తో తనలా పోలి ఉండే 5 మందిని వినియోగిస్తారని ప్రచారం ఉంది. చరిత్రలో హిట్లర్, సద్దాం లాంటి వారు కూడా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేప్పుడు డూప్ లనే పంపేవారంట. దీంతో లూయిస్ మెన్స్ అనుమానం వ్యక్తం చేసినట్లు మొన్న కనిపించిన కిమ్ అసలు కిమ్ కాదా లేదంటే సర్జరీ తర్వాత ఆయన బాడీలో ఈ మార్పులు వచ్చాయా అన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది.