
పంజాగుట్ట, వెలుగు: బీఆర్ఎస్హయాంలో జరిగిన ఫోన్ట్యాపింగ్పై సమగ్ర విచారణ జరిపించాలని అరుణ్కుమార్అనే లాయర్ శుక్రవారం రాత్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శోభన్ను కలిసి ఫోన్ ట్యాపింగ్కేసులో మాజీ సీఎం కేసీఆర్ను ఏ–1గా చేర్చాలని కోరారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ ప్రత్యేక ఆదేశాలతో మాత్రమే ఫోన్ సంభాషణలు వినే అవకాశం ఉంటుందని, అందుకు విరుద్ధంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ఎస్హయాంలో జరిగిన అవినీతిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.