కాంగ్రెస్ సభకు నేతల కుస్తీ... 1.50 లక్షల మంది టార్గెట్​

కాంగ్రెస్ సభకు నేతల కుస్తీ... 1.50 లక్షల మంది టార్గెట్​
  •     ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల మంది టార్గెట్​
  •     తుక్కగూడకు సమీపంలోని సెగ్మెంట్ల నుంచి పది వేలు
  •     దూర ప్రాంతాల నుంచి ఐదారు వేల తగ్గకుండా ఏర్పాట్లు

నల్గొండ, వెలుగు : హైదరాబాద్​లో జరుగనున్న  సోనియా గాంధీ సభను సక్సెస్​ చేయడానికి స్థానిక నేతలు కుస్తీ పడుతున్నారు. ఈనెల 17న  తలపెట్టిన సభకు ఉమ్మడి జిల్లా నుంచి 1.50 లక్షల మందిని తరలించాలని హైకమాండ్​ ఆదేశాలిచ్చింది. నియోజకవర్గానికి పది వేల చొప్పున జన సమీకరణ చేస్తామని సీనియర్​ లీడర్లు హామీ ఇచ్చారు. ఈమేరకు గురువారం గాంధీ భవన్​లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం సమావేశం జరిగింది. పార్లమెంట్​ ఇన్​చార్జి, ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్​కు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్​ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, డీసీ సీ అధ్యక్షుడు శంకర్​ నాయక్​, మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్​, కిషన్​ నా యక్​, రవినాయక్​ తదితరులు పాల్గొన్నారు.

జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి  హాజరుకాలేదని  తెలిసింది. ఎంపీ సెగ్మెంట్​ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి 70వేల మందిని తరలించాలని నిర్ణ యించారు. సభ జరిగే తుక్కుగూడ ప్రాంతానికి దగ్గరల్లోని నియోజకవర్గాల నుంచి 10 వేలు, దూరంగా ఉన్న సెగ్మెంట్​ల నుంచి ఐదారు వేల మందిని  తరలించాలని నిర్ణయించారు.  భువనగిరి ఎంపీ సెగ్మెంట్​ మీటింగ్​ శుక్రవారం జరగనుంది. సోనియా సభకు ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉండటంతో నేతలు హైరానా పడుతున్నారు. జన సమీకరణ విషయంలో హైకమాండ్ దృష్టి పెట్టింది.  ఏ నియోజకవర్గం నుంచి ఎంత మందిని జనం తరలిస్తున్నారనే వివరాలను ఎప్పటికప్పుడు   సేకరిస్తున్నారు. 

అడ్డుకుంటున్న బీఆర్​ఎస్​ శ్రేణులు...

సోనియాగాంధీ సభకు జనం వెళ్లనీయకుండా  బీఆర్​ఎస్​ లీడర్లు యత్నిస్తున్నారని కాంగ్రెస్​ నేతలు అంటున్నారు.  అదే రోజు బీజేపీ అమిత్​షా మీటింగ్​ కూడా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్​ సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు పెట్టిందని, ఆర్టీసీ బస్సులు అద్దెకు  ఇవ్వకుండా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని కాంగ్రెస్​ నేతలు అంటున్నారు.  కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో గ్రూపు తగాదాలు జన సమీకరణ మీద ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.    గురువారం మీటింగ్​కు సూర్యాపేట, దేవరకొండ మాజీ ఎమ్మెల్యేలతోపాటు, టికెట్​ ఆశిస్తున్న నేతలు కూడా హాజరయ్యారు.  

లీడర్లను సమన్వయం చేసే బాధ్యత ఇన్​చార్జిలకే..

సోనియా సభ పైనే సీనియర్లు ఫోకస్​ పెట్టారు. ఎన్నికల టైంలో ఖర్చుతో కూడుకున్న పని అని కొన్ని చోట్ల ముఖ్యనేతలు ముందువెనకా ఆలోచిస్తున్నారు. కానీ టికెట్​ ఆశిస్తున్న లీడర్లు మాత్రం వెనక్కి తగ్గడం లే దు. ముఖ్యంగా రేవంత్​ రెడ్డి, జానారెడ్డి అనుచరులు నకిరేకల్​, సూర్యాపే ట, మునుగోడు నియోజకవర్గాల నుంచి జనాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డికి పోటీగా జానారెడ్డి కొడుకు రఘువీర్​ రెడ్డి, సూర్యాపేటలో దామోదర్​ రెడ్డికి పోటీగా పటేల్​ ర మేష్​ రెడ్డి జన సమీకరణ పైన ఫోకస్​ పెట్టారు. మునుగోడులో చల్లా కృష్ణా రెడ్డి, పాల్వాయి స్రవంతి వర్గం మధ్య పోటీ నడుస్తోంది. సోనియా సభ ద్వా రా బలప్రదర్శన చేయాలని నేతలు భావిస్తుండటంతో కేడర్​లో కూడా జోష్ పెరిగింది. 

18 నుంచి ప్రచార కార్యక్రమాలు...

సోనియా సభ తర్వాత ఈనెల 18 నుంచి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పీసీసీ ఆదేశించింది. ఈమేరకు ఎంపీ ఉత్త మ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డిలను నియోజకవర్గ ఇ న్​చార్జిలుగా నియమించింది. వీళ్లతోపాటు అన్ని నియోజకవర్గాలకు కోఆ ర్డినేటర్లను నియమించింది. ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి కోదాడ, హుజూర్​నగర్​, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి నల్గొండ, భువనగిరి, జనగామ, మునుగోడు, తుంగతుర్తి, జానారెడ్డి భువనగిరి, నకిరేకల్​, మిర్యాలగూడ, నాగార్జునసాగర్​ బాధ్యతలు అప్ప గించారు.