ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన జస్టిస్ ఏకే త్రిపాఠి
న్యూఢిల్లీ: కరోనాతో లోక్పాల్ మెంబర్ చనిపోయారు. నలుగురు లోక్పాల్ సభ్యుల్లో జస్టిస్ అజయ్కుమార్ త్రిపాఠి ఒకరు. పోయిన నెల 2న ఆయన కరోనా లక్షణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ఏప్రిల్5న పాజిటివ్గా తేలింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. క్రిటికల్ కేర్ యూనిట్లో ఇన్నాళ్లు ఆయనకు వెంటిలేటర్పై ట్రీట్మెంట్ చేశారు.
పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి ఆయన కన్నుమూశారు. ఇంతకుముందు ఆయన ఛత్తీస్గఢ్ చీఫ్ జస్టిస్గా పనిచేశారు. బీహార్ అడిషనల్ అడ్వొకేట్ జనరల్గానూ సేవలందించారు. ఆ తర్వాత పాట్నా హైకోర్టుకు అడిషనల్ జడ్జిగా ప్రమోషన్ పొందారు. కొన్నాళ్లకు అదే హైకోర్టుకు చీఫ్ జస్టిస్ అయ్యారు. పోయినేడాది మార్చి 23న లోక్పాల్ సభ్యుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.