భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనిక బాత్రా చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో కాంస్య పతకం సాధించింది. ప్రపంచ ఆరో ర్యాంకర్.. మూడు సార్లు ఆసియా కప్ ఛాంపియన్ అయిన జపాన్ ప్లేయర్ హినా హయత్పై 4-2 ( 11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2) పాయింట్లతో ఓడించి బ్రౌంజ్ను దక్కించుకుంది. దీంతో ఆసియా కప్ టేబుల్ టెన్నిస్లో కాంస్యం సాధించిన మొదటి మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మనికా రికార్డు నెలకొల్పింది.
https://twitter.com/the_bridge_in/status/1593900038312562688
ఆసియాకప్ టోర్నీ ఫస్ట్ రౌండ్లో మనికా చైనాకు చెందిన జింగ్ టాంగ్పై విజయంసాధించి..రెండో రౌండ్కు చేరుకుంది. ఆ తర్వాత నాల్గో సీడ్ ప్లేయర్ను మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో ఆమె 4-3 (6-11,11-6,11-5,11-7,8-11,9-11,11-9)స్కోరు తేడాతో విజయం సాధించి సెమీస్కు చేరింది. ఇక సెమీస్లో మిమా ఇటో చేతిలో 2-4(8-11,11-7,7-11,6-11,11-8,7-11)తో ఓడిపోయింది. అయినా కాంస్య పతక పోరులో హనా హయతపై అద్భుత ఆటతీరుతో గెలిచి చరిత్ర సృష్టించింది.