
నర్సాపూర్/శివ్వంపేట వెలుగు: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కాంగ్రెస్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆదివారం నర్సాపూర్ లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఆదివారం నర్సాపూర్ నుంచి వెల్దుర్తి వెళ్లే రూట్లో ఉన్న సాయి కృష్ణ గార్డెన్ లో జాబ్ మేళా జరుగనుంది. 60 కంపెనీల్లో1,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ నాయకుడు నవీన్ గుప్తా తెలిపారు.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకే రాజిరెడ్డి 60 కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు చేసుకున్న వారికి అర్హతకు తగిన ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.