
- విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భవిత స్కూళ్లలో మిడ్ డే మీల్స్ను అమలు చేసేందుకు ప్లాన్ చేస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఆమె బుధవారం పర్యటించారు. కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కొత్తగూడెం పట్టణం రైటర్ బస్తీలోని భవిత స్కూల్ను సందర్శించారు. టాయిలెట్స్గోడలపై కూడా ఆకట్టుకునే బొమ్మలు వేయాలని సూచించారు. స్కూల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు.
దివ్యాంగ స్టూడెంట్స్తో పాటు వారి తల్లిదండ్రులతో ఆమె మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. భవిత స్కూళ్లపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారని ఆమె తెలిపారు. ఈ స్కూళ్లకు పక్కా బిల్డింగ్స్, మౌలిక సదుపాయాల కోసం రూ. 15కోట్లు రిలీజ్ చేశారన్నారు. ఈ పిల్లల కోసం స్పెషల్గా సదరం క్యాంపులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భవిత స్కూళ్లలోచదివే 8, 9, 10వ తరగతి స్టూడెంట్స్ కోసం పెద్ద అక్షరాలతో ప్రత్యేకంగా రూపొందించిన బుక్స్ను అందజేయనున్నట్టు తెలిపారు.
స్కూళ్లలో కాంపౌండ్ వాల్స్నిర్మాణం కోసం ఉపాధి హామీ స్కీం కింద ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఇటుకల గురించి కలెక్టర్ ఆమెకు వివరించగా, ఆమె ప్రశంసించారు. ఆమె వెంట డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ. నవీన్ నికోలస్, అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉషారాణి, ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, జాయింట్ డైరెక్టర్లు వెంకటనర్సమ్మ, మదన్ మోహన్, రాజీవ్, ఐటీడీఏ పీవో రాహూల్, డీఈవో వెంకటేశ్వరాచారి, ఎంఈవో ప్రభుదయాల్, విద్యాశాఖ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలరోల్ మోడల్
పాల్వంచ : అటానమస్ కళాశాలగా అవతరించిన పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రోల్ మోడల్ గా చూపాలని యోగితారాణా విద్యాశాఖ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేనకు సూచించారు. ఈ కళాశాలను ఆమె సందర్శించి పలు సూచనలు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ పద్మ, ఉత్తమ లెక్చరర్ గా అవార్డు సాధించిన టి అరుణ కుమారి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జై మాధవి కృషిని ఆమె అభినందించారు.
ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి
బూర్గంపహాడ్ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని యోగితా రాణా సూచించారు. బుధవారం రాత్రి బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల గురుకుల కళాశాలతో పాటు కేజీబీవీలను కలెక్టర్ జితేశ్వీ పాటిల్ తో కలసి ఆమె సందర్శించారు. బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థినులతో కలిసి వారు భోజనం చేశారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించి అక్కడే బస చేశారు.