త్వరలోనే కేంద్రాన్ని గద్దె దించుతాం : మంత్రి హరీష్ రావు

త్వరలోనే కేంద్రాన్ని గద్దె దించుతాం : మంత్రి హరీష్ రావు

సిద్దిపేట జిల్లా : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలన్నా సీఎం కేసీఆర్ మద్దతు తప్పకుండా కావాలన్నారు. తెలంగాణకు రావాల్సిన లక్షా పదివేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నిలిపి వేసిందని చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. 

రాష్ర్టంలో వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టకపోవడం వల్ల 21 వేల కోట్ల రూపాయలను కేంద్రం నిలిపివేసిందని, గడిచిన మూడేళ్లలో తెలంగాణకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను.. కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు.