
యాదాద్రి, వెలుగు: చేప పిల్లల సప్లయ్కి సంబంధించి ఈ–టెండర్లకు మూడోసారి గడువు పెంచడంతో 6 బిడ్లు దాఖలయ్యాయి. ఏపీకి చెందిన నలుగురు, నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు రూ.6.50 లక్షల చొప్పున ఈఎండీ చెల్లించారు. టెండర్లలో పాల్గొన్నవారు పేర్కొన్న అడ్రస్కు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు వెళ్లి ఇన్స్పెక్షన్ చేయనున్నారు.
ఈ నెల 25లోగా కలెక్టర్ ఆధ్వర్యంలో బిడ్లు ఓపెన్ చేసి ప్రపోజల్ రేటు కంటే ఎవరు తక్కువ రేటు కోట్చేస్తే వారిని ఎల్–1, 2, 3గా గుర్తిస్తారు. ఎల్–1 చేపల సప్లయ్కి ఆసక్తి చూపకంటే అతను చెల్లించిన ఈఎండీ రూ.6.50 లక్షలను జప్తు చేస్తారు. అనంతరం ఎల్–-2కు అవకాశం ఇస్తారు. యాదాద్రి జిల్లాలోని 1,155 చెరువుల్లో చేపల పెంపకానికి 687 అనువుగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. వీటిల్లో 2.80 కోట్ల చేప పిల్లలను వదలాలని ని
ర్ణయించారు.