
సిద్దిపేట, వెలుగు: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామిని సిద్దిపేట ఆర్యవైశ్య మహాసభ నేతలు సోమవారం కలిశారు. ఆర్యవైశ్య మహా సభ రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్, కార్యవర్గ సభ్యుడు అయిత రత్నాకర్, జిల్లా మాజీ అధ్యక్షుడు కాసం నవీన్ కుమార్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి తడక లింగ మూర్తి హైదరాబాద్ లో మంత్రిని కలిసి ఆర్య వైశ్యుల సమస్యలను వివరించారు.
సిద్దిపేట జిల్లాలోని పేద వైశ్యులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, ప్రభుత్వ అన్ని స్కీముల్లో వైశ్యులకు అవకాశం కల్పించాలని రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ లో పని చేస్తున్న వైశ్య నాయకులకు పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని, జిల్లా ఆర్యవైశ్య మహాసభ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరారు. ఆయా అంశాలను విన్న మంత్రి వివేక్ వెంకట్ స్వామి సానుకూలంగా స్పందించినట్టు ఆర్య వైశ్య మహాసభ నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఆర్య వైశ్య మహా సభ నేతలు మంత్రి వివేక్ వెంకటస్వామిని శాలువాతో సన్మానించారు.
మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన నాగపురి రాజలింగం, కిరణ్కుమార్
చేర్యాల, వెలుగు: మంత్రి వివేక్ వెంకటస్వామిని మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్, ఆయన కుమారుడు కిరణ్కుమార్ గౌడ్హైదరాబాద్లోని ఆయన ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్సెంటర్ ఏర్పాటు చేయాలని, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, రేడియాలజీ డాక్టర్లను నియమించాలని కోరారు. సమీకృత భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయించాలని, అంబేద్కర్సెంటర్లో షాపింగ్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలని, కొమురవెల్లి ఆలయానికి వచ్చి రివ్యూ మీటింగ్నిర్వహించాలని విన్నవించారు. ఈ సందర్బంగా చేర్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అన్ని చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.