గతేడాది 19,724 మంది అదృశ్యం
3,418 మంది ఇంకా దొరకలె
స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు
హైదరాబాద్, వెలుగు: మహబూబాబాద్,శామీర్పేట్ మైనర్ల కిడ్నాప్, మర్డర్ కేసులతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పీఎస్లో నమోదైన మిస్సింగ్ కేసులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ ఏడాదిలో ఈ నెల26 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,282 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో ఈనెల 15న శామీర్పేట్లో అదృశ్యమై హత్యకు గురైన అధియాన్(5) బాలుడి వివరాలు కూడా పోలీస్ వెబ్సైట్లో అప్లోడ్ అయ్యాయి. ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. ఈనెల23న నిందితుడు(17) చేసిన ఫోన్ కాల్తో అధియాన్ హత్యకు గురయ్యాడని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసులో మిస్టరీ వీడింది.
15 శాతం మిస్టరీగానే..
ప్రతిఏటా నమోదయ్యే మిస్సింగ్ కేసుల్లో దాదాపు 85 శాతం కేసులు ట్రేస్ అవుతున్నాయి. మరో 15 శాతం కేసులు మిస్టరీగానే ఉంటున్నాయి. గతేడాది రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేసుల్లో 3,418 కేసులు ఇంకా ట్రేస్ కాలేదు. ఇందులో 655 మంది మైనర్ల ఆచూకీ లభించలేదు. ఇలా పెండింగ్లో ఉన్న కేసులను సీఐడీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సీసీటీఎన్ఎస్, పోలీస్ వెబ్సైట్లో అప్లోడైన డాటాబేస్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యాప్స్తో పాటు బీట్ కానిస్టేబుల్స్,పెట్రోల్ వెహికల్స్, బ్లూకోల్ట్స్,క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పోలీసులకు మిస్సింగ్ కేసు ఫొటోలను అందుబాటులో ఉంచుతారు. అంతేకాకుండా ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ స్కాన్ కూడా చేస్తారు.
మిస్సింగ్, కిడ్నాప్ కేసులతో దర్యాప్తు
మైనర్స్ మిస్సింగ్ కేసుల్లో పేరెంట్స్ ఇచ్చే సమాచారం ఆధారంగా కేసులు ఫైల్చేస్తారు. ఇలాంటి కేసుల్లో లుక్ ఔట్ నోటీసులు ఇచ్చి ట్రేస్ చేస్తారు. 15 నుంచి 25 ఏండ్ల ఏజ్ మైనర్స్ ,యువతుల మిస్సింగ్ ల్లో ప్రేమ, కుటుంబ కలహాలపై పోలీసులు ఆరా తీస్తారు. జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సంబంధిత పోలీసులను అలర్ట్ చేస్తారు. ప్రేమ, వివాహేతర సంబంధాలతో వెళ్లిపోయిన యువతులు, మైనర్స్ మిస్సింగ్ కేసుల్లో వివరాలు ఆలస్యంగా తెలుస్తున్నాయి. ఇలాంటి కేసులు పోలీస్ వెబ్ సైట్ మిస్సింగ్ కేసుల డాటాలో పెండింగ్లోనే ఉండిపోతున్నాయి.
దర్పణ్ యాప్తో ట్రేస్
దేశవ్యాప్తంగా రిజిస్టరైన డాటాబేస్తో ఆధారంగా చైల్డ్ హోమ్స్, గుర్తు తెలియని డెడ్బాడీలను ఫేషియల్ రికగ్నేషన్, దర్పణ్ యాప్తో పరిశీలిస్తారు. మ్యాచింగ్ ఫొటోస్ ఆధారంగా సంబంధిత పోలీసులకు సమాచారం అందిస్తారు. గుర్తు తెలియని డెడ్బాడీస్ ఫింగర్ ప్రింట్స్తో ఆధార్ అడ్రస్ తెలుసుకుంటారు. దీంతో సంబంధిత పోలీసులకు సమాచారం అందించి వివరాలు సేకరిస్తారు. జహీరాబాద్ పోలీస్స్టేషన్ లో 2013లో నమోదైన కళ్ళెం విజయ్(18) మిస్సింగ్ కేసును గతేడాది ఛేదించారు. హోటల్ క్యాటరింగ్లో పనిచేసే విజయ్ని ఆధార్ డేటా బేస్తో గుర్తించి పేరెంట్స్కి అప్పగించారు.
రాష్ట్రంలో గతేడాది నమోదైన కేసులు (ఎన్సీఆర్బీ డాటా ప్రకారం)
జెండర్ మిస్సింగ్ కేసులు ట్రేస్(శాతాల్లో) ట్రేస్ కానివి 18 ఏండ్ల లోపు
మహిళలు 11,839 87.2 1,745 362
పురుషులు 7,885 82.5 1,673 293
మొత్తం 19,724 85.2 3,418 655
For more news…
ఆధార్ కార్డుల్లో డేటా మార్పిడి చేస్తున్న ముఠా గుట్టు రట్టు..