కోతులు చనిపోతే రాజకీయం చేయడం సిగ్గుచేటు : కుందూరు జైవీర్ రెడ్డి 

కోతులు చనిపోతే రాజకీయం చేయడం సిగ్గుచేటు :  కుందూరు జైవీర్ రెడ్డి 

హాలియా, వెలుగు : గతంలో కొండగట్టు గుట్టల్లో భారీ ప్రమాదం జరిగితే స్పందించని బీఆర్ఎస్ నాయకులు.. కోతులు చనిపోతే రాజకీయం చేయడం సిగ్గుచేటని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్ లో వాటర్​ట్యాంకులో పడి కోతులు చనిపోయిన ప్రదేశాన్ని గురువారం  ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవిలో కోతులు తాగునీటి కోసం ప్రమాదవశాత్తు వాటర్​ట్యాంకులో పడి చనిపోవడం బాధాకమన్నారు. బీఆర్​ఎస్​ నాయకులకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదన్నారు. ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేస్తే ప్రజలు మరోసారి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఆయన వెంట బ్లాక్​ కాంగ్రెస్​అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్​రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.