
- ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం, వెలుగు : పోస్టల్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. ఆదివారం నిర్వహించిన నేషనల్ అసోషియేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ గ్రూప్ సి 5వ వార్షికోత్సవ మహాసభలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పోస్టల్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అర్హత ఉన్న వారికి అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి మాట్లాడుతూ..మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు తమ ఆలోచన విధానాలను మార్చుకుని డిపార్ట్మెంట్అభ్యున్నతికి తోడ్పడాలన్నారు. ఈ మహాసభలో ఎన్ఏపీఈ గ్రూప్ సీ ఆల్ఇండియా మాజీ కార్యదర్శి కిషన్రావు, ఎఫ్ఎన్పీవో సెక్రటరీ జనరల్ వాసిరెడ్డి శివాజీ, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జలీల్లు పాల్గొన్నారు.