
ఢిల్లీ : నేడు (సెప్టెంబర్ 26వ తేదీ) సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే. నళిని చిదంబరం తరహాలో తనకు వెసులుబాటు కావాలని కోరారు. కోర్టు తీర్పు వచ్చే వరకు బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరారు.
ALSO READ :- ఒక్కరోజు గ్యాప్లో రెండుసార్లు తెలంగాణకు మోదీ
గత విచారణ సందర్భంగా ఈడీ ముందు మహిళల హాజరు అంశంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలకు 10 రోజుల సమయం కోరింది ఈడీ. దీంతో కవితకు 10 రోజులపాటూ నోటీసులను వాయిదా వేసింది ఈడీ. కవిత కేసును జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం విచారణ జరపనుంది.