
షాద్ నగర్, వెలుగు: మొగిలిగిద్ద పాఠశాల త్వరలో 150 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. దీంతో కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ సోదరుడు సామాజికవేత్త శ్యాంసుందర్, మల్లేశ్, గ్రామస్తులు ఎమ్మెల్సీలు మీర్ అలీఖాన్, ప్రొఫెసర్ కోదండరాంలను కలిశారు. త్వరలోనే 150 ఏండ్ల పాఠశాల వేడుకకు రావాలని ఆహ్వానించారు.
హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ఉత్తర్ప్రదేశ్ గవర్నర్గా అన్నారం వాసి సత్యనారాయణరెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి మేధావులు ఇక్కడ చదువుకున్న వారే అని గుర్తు చేశారు. ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని ప్రభుత్వం నూతన భవనం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.