చిత్తూరు జిల్లా కుప్పంలో మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లర్ రామనాథరెడ్డి అరెస్ట్ చేశారు పోలీసులు. 62 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా ఉంచిన పోలీసులు..పక్కా సమాచారంతో కుప్పం - కృష్ణగిరు హైవేపై నడుమూరు చెక్ పోస్ట్ దగ్గర తనికీ చేశారు. లారీ, స్కార్పియో వాహనాల్లో సోదాలు చేయగా 62 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. కడప జిల్లాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ రామనాథరెడ్డిని, అతని అనుచరులు ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, వాహనాల విలువ సుమారు రూ.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం