- ఏ పనైనా శ్రద్ధతో చేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- లక్ష్య సాధన కోసం కష్టపడాలని యువతకు పిలుపు
- ఐఎస్బీలో జాతీయ యువజన దినోత్సవానికి చీఫ్ గెస్ట్గా హాజరు
గచ్చిబౌలి, వెలుగు: యువత లక్ష్య సాధన కోసం కష్ట పడాలని, ఫెయిల్యూర్స్ను తట్టుకొని నిలబడగలగాల ని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పిలుపునిచ్చారు. సమస్య ఎక్కడ ఉందో గుర్తించి, స్వామి వివేకానంద చెప్పినట్లు ఏ పని చేసినా శ్రద్ధపెట్టాలని సూచించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో సీఐఐ యంగ్ ఇండియన్స్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘2047 నాటికి భారత్ అభివృద్ధి, నాయకత్వం వైపు యువత కార్యాచరణ’ అనే అంశంపై నిర్వహించిన చర్చలో ముఖ్య అతిథిగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు.
‘‘మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని కోసం హార్డ్వర్క్చేయాలి. అదే మనల్ని ఉన్నతస్థాయిలో నిలబెడుతుంది”అని చెప్పారు. మనం ఏదైనా వస్తువు తయారు చేయా లనుకుంటే అది సాధారణ వ్యక్తికి కూడా ఉపయోగపడేదై ఉండాలన్నారు. ఉద్యోగాలు చేయడం కాదని.. కొలువులను సృష్టించే స్థాయికి ఎదగాలని యువతకు పిలుపునిచ్చారు. అనంతరం ఐఎస్బీ అసోసియేట్ డైరెక్టర్ శ్రీధర్ భాగవతుల మాట్లాడారు.
