దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు. ఒకటి, రెండు కాదు ఏకంగా ఏడు కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు. అన్ని నోట్లు కూడా 2 వేల రూపాయలవే ముంద్రించి.. సర్క్యులేట్ చేసిందుకు ప్లాన్ చేశారు. దీని గురించి పోలీసులకు పక్కా సమాచారం అందడంతో రైడ్ చేసి పట్టుకున్నారు.
అంతా రూ.2 వేల నోట్లు ఉన్న ఏడు కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను స్వాదీనం చేసుకున్నామని ముంబై క్రైం బ్రాంచ్ డీసీపీ సంగ్రామ్ నిషందర్ తెలిపారు. ఈ సందర్భంగా నకిలీ నోట్ల ముఠాకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు. వారిని కోర్టులో హాజరు పరిచి, ఈ ముఠాకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు కస్టడీకి కోరామని చెప్పారు. ఈ నెల 31 వరకు పోలీసు కస్టడీకి కోర్టు ఓకే చెప్పిందన్నారు. వారిని ఎంక్వైరీ చేసి.. మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని సంగ్రామ్ చెప్పారు.
Mumbai Police Crime Branch arrested 7 persons with fake Indian currency notes of 2000 denominations having a face value of Rs 7 crores. The accused have been sent to police custody till Jan 31 by a court: DCP Sangram Nishandar pic.twitter.com/5lm6qcaZ0H
— ANI (@ANI) January 26, 2022