మెగా హీరో వరుణ్ తేజ్(Varun tej)- లావణ్య(Lavanya tripathi)ల పెళ్లి నవంబర్ 1న ఇటలీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ, ఇరు కుటుంబాలు, పలువురు బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్ళికి సంబందించిన పలు ఫొటోలతోపాటు మెగా ఫ్యామిలీ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా.. మెగా బ్రదర్ నాగబాబు తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటోను షేర్ చేశారు. తన అన్నా చిరంజీవి, తమ్ముడి పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి దిగిని పిక్ ను షేర్ చేశారు.
Also Read :- మా వదినమ్మ వచ్చేసింది
ఆ ఫొటోకు ఎమోషనల్ నోట్ ను కూడా యాడ్ చేశాడు.. మా మధ్య కూడా విభేదాలు, వాదనలు ఉంటాయి. అయినా మా ఈ బంధం ఎంతో ప్రత్యేకమైంది. జీవితంలో ఇప్పటివరకు చేసిన పనులనే కాదు.. జ్ఞాపకాలను కలిసే పంచుకున్నాం. మా మధ్య ఉన్న ఈ బంధం ఎంతో ముఖ్యమైనది. బలమైన జ్ఞాపకాలపై ఈ బంధం ఆధారపడి ఉంది. మా ముగ్గురి మధ్య ఉన్న ఈ బలమైన బంధానికి నేను మనసారా విలువనిస్తాను.. అంటూ ఎమోషనల్ కోట్ రాసుకొచ్చారు నాగబాబు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.