టాయిలెట్స్ కడిగిన మంత్రి జూపల్లి..పెంట్లవెల్లి తహసీల్దార్ ఆఫీస్లో అపరిశుభ్రం

టాయిలెట్స్ కడిగిన మంత్రి జూపల్లి..పెంట్లవెల్లి తహసీల్దార్ ఆఫీస్లో  అపరిశుభ్రం

కొల్లాపూర్, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా పెంట్లవెల్లి తహసీల్దార్​ ఆఫీస్​లో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా శుభ్రం చేశారు. వివరాల్లోకి  వెళ్తే.. శుక్రవారం తహసీల్దార్​ ఆఫీస్​ను మంత్రి తనిఖీ చేసి, వివిధ అంశాలపై రివ్యూ చేశారు. ఆర్డీవో ఆఫీస్​కు ఫైళ్లు పంపించడంలో జాప్యం చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆఫీస్ ను పరిశీలించారు. 

ఈక్రమంలో టాయిలెట్స్  అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు పోసి టాయిలెట్లను శుభ్రం చేశారు. ఆఫీస్​ నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియను పరిశీలించి, లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి  మాట్లాడారు.