
ఏపీలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో 37,922 మందికి కరోనా టెస్టులు చేయగా.. 8,987మందికి పాజిటివ్ వచ్చింది. మరో 35 మంది మరణించారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసల సంఖ్య 9 లక్షల 76 వేల 987 కు చేరాయి. నిన్న ఒక్కరోజే 3,116 మంది కరోనా నుంచి కొలుకున్నారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు 9 లక్షల 15వేల 626 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 53,889 మంది ఆస్పత్రిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఏపీలో కోటి 57లక్షల 53 వేల 679 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.