యూట్యూబ్ కొత్త సీఈఓ నీల్ మోహన్
న్యూఢిల్లీ : వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ సీఈఓగా నీల్మోహన్ అపాయింటయ్యారు. స్టాన్ఫోర్డ్లో గ్రాడ్యుయేషన్ చేసిన ఈ ఇండియన్ 2008 లో గూగుల్లో జాయినయ్యారు. దీంతో గ్లోబల్ కంపెనీలకు సీఈఓల జాబితాలో మరో భారతీయుడు చేరినట్లయింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా పెద్ద టెక్ కంపెనీలకు 8 మంది భారతీయులు సీఈఓలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2015 నుంచీ యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా నీల్ మోహన్ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యూట్యూబ్ షార్ట్స్, మ్యూజిక్, సబ్స్క్రిప్షన్ ఆఫరింగ్స్పై ఫోకస్తో ఆయన పనిచేశారు. గూగుల్లో జాయినవడానికి ముందు డబుల్క్లిక్ కంపెనీలో ఆరేళ్లపాటు నీల్ మోహన్ ఉద్యోగం చేశారు.