వెంటాడుతున్న చావు : క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన నిర్భయ దోషి

వెంటాడుతున్న చావు : క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన నిర్భయ దోషి

ఉరిశిక్ష గడువు దగ్గరపడుతుండడం తో నిర్భయ దోషులకు చావు భయం, బతకాలనే ఆశ రోజు రోజుకి పెరుగుతుంది. ఉరిశిక్ష అమలుకు మూడురోజుల గడువు ఉండడంతో..ఉరిశిక్ష నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుతున్నారు. తాజాగా నిర్భయ దోషి అక్షయ్ ఠాకూర్.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు  క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తాను గతంలో దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ లో అన్నీ   వాస్తవాలు లేవని పేర్కొన్నాడు.

కాగా దోషుల్ని ఉరితీసేందుకు కొత్తగా డెత్ వారెంట్ జారీ చేయాలని పాటియాలా కోర్ట్ అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా ఉత్తర్వులు జారీ చేశారు.