కరోనా వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వబోమని మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. థానే మేయర్ నరేశ్ మహస్కే, మున్సిపాలిటీ కమిషనర్ డాక్టర్ విపిన్ వర్మల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఇప్పటికీ కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ కూడా వేసుకోని ఉద్యోగులకు జీతం ఇవ్వకూడదని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనిపై ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గడువు దాటిపోయిన తర్వాత కూడా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకుండా ఉన్న ఉద్యోగులకు కూడా జీతాలు నిలిపేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా రెండో డోసు వ్యాక్సిన్ పూర్తి చేసుకుని వారి వ్యాక్సిన్ సర్టిఫికెట్ను ఆఫీస్లో సబ్మిట్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ఈ నెలాఖరులోపు థానే సిటీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని పని చేస్తున్నామని మేయర్ నరేశ్ తెలిపారు. ఇందుకోసం మంగళవారం భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించామన్నారు. చాలా మంది గడువు ముగుస్తున్నా రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావడం లేదని, ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. భారీగా వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆన్వీల్ వ్యాక్సిన్ సెంటర్లను కూడా పెట్టామని తెలిపారు. ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ల వివరాలు సేకరించి, టీకా వేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇందుకోసం 167 టీమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ వేయించుకోకుంటే జీతం ఇవ్వం
- దేశం
- November 10, 2021
లేటెస్ట్
- పైన చింతపండు.. లోపల గంజాయి.. హనుమకొండ బస్టాండ్లో నలుగురు అరెస్ట్
- దొంగలు బీభత్సం.. బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరీ
- అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏడ్చేది..ఇప్పుడు పాక్ ఏడుస్తున్నది
- ముగిసిన కాసరవేణి రవి అంత్యక్రియలు
- మహిళలకు ఫ్రీగా బ్యుటీషియన్ కోర్సు
- తీన్మార్ మల్లన్నకే మా మద్దతు .. పీఆర్టీయూ తెలంగాణ ప్రకటన
- జొన్నల కొనుగోళ్ల పరిమితి పెంపు
- యాదగిరిగుట్టకు ఏప్రిల్లో రూ. 15 కోట్ల 64 లక్షల ఇన్కం
- యర్కారంలో ఇరువర్గాల ఘర్షణ
- పోర్షే కొత్త కారు @ రూ.1.70 కోట్లు
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్