ODI World Cup 2023: భారత విజయంపై అసూయ.. పాకిస్థానీ నటిని విషం తీసుకోమన్న అభిమాని

ODI  World Cup 2023: భారత విజయంపై అసూయ.. పాకిస్థానీ నటిని విషం తీసుకోమన్న అభిమాని

ఐకానిక్ స్టేడియం వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ పోరులో భారత జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ ఉత్కంఠభరిత పోరులో టీమిండియా 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 

మొదట కోహ్లీ(117), అయ్యర్(105) సెంచరీలతో చెలరేగడంతో 397 పరుగుల భారీ స్కోర్ చేసిన టీమిండియా.. అనంతరం షమీ(7 వికెట్లు) విజృంభించడంతో కివీస్‌ను 327 పరుగులకే కట్టడి చేసింది. ఈ విజయంలో భారత జట్టు వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో అడుగుపెట్టింది. అయితే, ఈ గెలుపును పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు, ఆ దేశ నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. విషం వెళ్లగక్కుతూ భారత్‌పై తమ వక్రబుద్ధిని బయట పెడుతున్నారు.  

భారత విజయంపై పాకిస్థానీ నటి సెహర్ షిన్వారీ ఆడి పోసుకుంది. టీమిండియా ఫైనల్‌ చేరడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నాను అని పోస్ట్ పెట్టింది. "భారత జట్టు మరోసారి ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ నెత్తుటి దేశం అన్నింటిలో మనకంటే ఎందుకు ముందుంది?.." అని సెహర్ షిన్వారీ ట్వీట్ చేసింది.

సెహర్ షిన్వారీ ట్వీట్‌కు భారత అభిమానులు సరైన రీతిలోనే బదులిస్తున్నారు. ఇలా ఏడిచే బదులు ఒకసారి విషం తీసుకొని చావొచ్చుగా అని ఒక నెటిజెన్ సూచించాడు. మరొక నెటిజెన్.. మేము ఇలా విజయాలు సాధిస్తూనే ఉండాలి.. మీరు అలా ఏడుస్తూనే ఉండాలి.. అని కౌంటర్ ఇచ్చాడు. ఈ ట్వీట్ల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

లీగ్ దశలోనే పాక్ ఇంటిదారి.. 

కాగా, లీగ్ దశలో 9 మ్యాచ్‌ల్లో నాలుగింట మాత్రమే విజయం సాధించిన పాక్ సెమీస్‌కు అర్హత సాధించాలకేపోయింది. దీంతో ఆ జట్టు బృందం ఇప్పటికే స్వదేశానికి చేరుకుంది.