పారా మెడికల్ సీట్ల కోసం ఈ నెల 9న కౌన్సిలింగ్ : డీఎంహెచ్ఓ పెండెం వెంకటరమణ

పారా మెడికల్ సీట్ల కోసం ఈ నెల 9న కౌన్సిలింగ్ :  డీఎంహెచ్ఓ పెండెం వెంకటరమణ
  •      డీఎంహెచ్ఓ పెండెం వెంకటరమణ

హుజూర్ నగర్, వెలుగు: ప్రభుత్వం అందిస్తున్న  వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ పెండెం వెంకటరమణ అన్నారు. బుధవారం హుజూర్ నగర్ పరిధిలోని మాధవరాయిని గూడెం లోని బస్తీ దవాఖానను తనిఖీ చేశారు.  క్షేత్రస్థాయిలో జరుగుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రభుత్వం అందిస్తున్న టీకాలను వేయించుకొని ఆయా వ్యాధుల నుంచి రక్షణ పొందాలన్నారు. 

జిల్లాలో పారామెడికల్ కాలేజీల్లో  సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 9 శుక్రవారం సూర్యాపేటలోని పద్మశాలీ భవన్ లో కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని తెలిపారు.  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం5 గంటల వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.