రూ. 134 కోట్లు రిలీజ్ చేయండి : యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేలు

రూ. 134 కోట్లు రిలీజ్ చేయండి : యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేలు

యాదాద్రి, వెలుగు: బస్వాపూర్​ రిజర్వాయర్​పెండింగ్​ ఫండ్స్​రూ. 134 కోట్లు రిలీజ్​ చేయాలని యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేలు కోరారు. మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డికి ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి, తుంగతుర్తి, నకిరేకల్, దేవరకొండ​ ఎమ్మెల్యేలు మందుల సామెల్​, వేముల వీరేశం, బాలూ నాయక్​ వినతిపత్రం అందించారు. 

ఈ రిజర్వాయర్​ ఇప్పటికే 90 శాతం పూర్తయిందని తెలిపారు. నిర్వాసితులకు  పరిహారం, ఆర్​అండ్​ఆర్​ పేమెంట్​ అందలేదన్నారు. ఈ ప్రాజెక్ట్​ పూర్తయితే దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందని పేర్కొన్నారు.  మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి స్పందించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఫార్వర్డ్​ చేశారు.  వెంటనే ఫండ్స్​రిలీజ్​ చేయాలని సూచిస్తూ ‘ప్రియారిటీ పేమెంట్​’ అని పేర్కొన్నారు.