
- ప్రజాభవన్కు పోటెత్తిన జనం
- ప్రజావాణిలో సమస్యలు చెప్పుకునేందుకు క్యూ
హైదరాబాద్లోని ప్రజాభవన్కు శుక్రవారం జనం పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్ లోపలి నుంచి రాజ్భవన్ రోడ్ సిగ్నల్ వరకు దాదాపు కిలోమీటరు మేర బారులు తీరారు. ఎక్కువ మంది ధరణి సమస్యపై.. కొందరు పింఛన్ల కోసం, ఇంకొందరు ఇండ్ల కోసం విన్నవించుకునేందుకు వచ్చారు.
హైదరాబాద్, వెలుగు : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి రాష్ట్రం నలుమూలల నుంచి జనం పోటెత్తారు. తమ సమస్యలు చెప్పుకొని వాటికి పరిష్కారం చూపించాలని ప్రభుత్వ పెద్దలను కోరేందుకు తరలివచ్చారు. శుక్రవారం ఉదయాన్నే ప్రగతిభవన్కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా 8 గంటలకే పెద్ద ఎత్తున జనం వచ్చి క్యూ లైన్ లో ఉన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా కొందరు తల్లులు చంటిబిడ్డలతో సహా వచ్చి క్యూ లైన్లో నిల్చున్నారు. భారీ ఎత్తున జనం తరలిరావడంతో క్యూ సోమాజిగూడ చౌరస్తా దాటింది.
317 జీవో బాధితులు
అసెంబ్లీ సెషన్ కారణంగా సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ప్రజావాణికి దూరంగా ఉన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్రోనాల్డ్రాస్, ఆయూష్కమిషనర్హరిచందన, హైదరాబాద్కలెక్టర్అనుదీప్ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన ప్రజలకు తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. 317 జీవో బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చారు. తమ సొంత జిల్లా నుంచి మూడు, నాలుగు వందల కి.మీ.ల దూరంలో పోస్టింగ్లు ఇచ్చారని, 350 మంది కుటుంబాలకు అన్యాయం జరిగిందని తెలిపారు.
టీఎస్పీఎస్సీ ఏఈఈ పరీక్షల ఫలితాలు ప్రకటించాలని కోరుతూ నిరుద్యోగులు వచ్చారు. హారిజెంటల్రిజర్వేషన్ఇష్యూను పరిష్కరించాలని కొందరు వినతిపత్రం ఇచ్చారు. ఫార్మాసిటీతో తమ భూములకు రైతుబంధు ఇవ్వడం లేదని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని రైతులు వినతిపత్రాలు ఇచ్చారు. 300 మంది హోం గార్డులను చిన్న సమస్యలతో తొలగించారని, ఉద్యోగాలు ఇవ్వాలని కోరేందుకు మరికొందరు వచ్చారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య పింఛన్ల కోసం పెద్ద సంఖ్యలో వచ్చారు. పదేళ్ల క్రితం తన తండ్రి చనిపోయినా, కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వలేదని వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చానని ఒక మహిళ తెలిపారు. 18 వేల మంది సాక్షర భారత్మండల, గ్రామ కో ఆర్డినేటర్లను తొలగించారని, తమకు ఉద్యోగం కల్పించాలని కోరుతూ వినతిపత్రాలు ఇచ్చారు.
జీవో నం.46తో మెరిట్ఉన్నా తమకు పోలీస్ఉద్యోగాలు రాలేదని కొందరు యువకులు దరఖాస్తులు ఇచ్చారు. కంటివెలుగు ప్రోగ్రామ్లో పనిచేసిన ఆప్తాల్మిక్అసిస్టెంట్లు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ అప్లికేషన్లు ఇచ్చారు. వీటితోపాటు ప్రజల నుంచి ధరణి భూసమస్యల వినతులు ఎక్కువగా వచ్చాయి.