స్వేచ్ఛ కోసం జనం తహతహ

స్వేచ్ఛ కోసం జనం తహతహ

జనం ఈ మధ్య డెమొక్రసీ, లిబరలిజం, ఫ్రీడం, అటానమీ లాంటి మాటలు మర్చిపోయారని, దీంతో ఆ కాన్సెప్టులకు ప్రస్తుతం కాలం చెల్లిందని కొందరు అనుకుంటున్నారు. కానీ.. ఇది కరెక్ట్​ కాదని టర్కీ, హాంకాంగ్, చెక్ రిపబ్లిక్ , సూడాన్ లలో జరిగిన సంఘటనలు చూస్తే అర్థమవుతోంది . జనం ఫ్రీడం కోసం ఎంత తహతహలాడుతున్నారో తెలుస్తుంది .

ప్రజల్లో ఇప్పుడు లిబరలిజం ఫీలింగ్స్​ మచ్చుకైనా లేవని రష్యా ప్రెసిడెంట్​ వ్లాదిమిర్​ పుతిన్​ ఇటీవల అన్నారు. దేశంలో తలదాచుకోవటానికి వచ్చే ఇతర దేశాలవాళ్లు, బతుకు దెరువు కోసం వలస వచ్చేవాళ్లు, మూడో జెండర్​ వ్యక్తుల విషయంలో ఉదారంగా ఉండాలనే ఆలోచనలను ప్రజల్లో ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. జీ–20 సదస్సుకు ముందు జరిగిన​ ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. చాలా మంది ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చోటుచేసుకుంటున్న పలు సంఘటనలను పరిశీలిస్తే పుతిన్​ అభిప్రాయాలు తప్పు అని ఇట్టే తేలిపోతుంది. తమకు స్వేచ్ఛ కావాల్సిందేనని జనం గళం విప్పుతున్నారు. టర్కీలోని ఇస్తాన్​బుల్ నగరం​లో, చెక్​ రిపబ్లిక్​ రాజధాని ప్రాగ్​లో, సూడాన్​ క్యాపిటల్​ సిటీ ఖర్తుమ్​తోపాటు హాంకాంగ్​లో లక్షల సంఖ్యలో ప్రజలు హక్కుల సాధన కోసం రోడ్ల మీదికి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. దీన్నిబట్టి ఫ్రీడం విషయంలో జనం ప్రభుత్వంతో మరీ అంతగా రాజీపడట్లేదని అర్థమవుతోంది. స్పందించాల్సిన సందర్భం వచ్చిన ప్రతిసారీ తమదైన రీతిలో పాలకుల కళ్లు తెరిపిస్తున్నారు.

ఇస్తాన్​బుల్​ ఓటర్లు  ఇలా బుద్ధి చెప్పారు..

టర్కీలోని ఇస్తాన్​బుల్​లో 3 నెలల కిందట పూర్తైన మేయర్​ ఎన్నికలను ప్రెసిడెంట్​ రెకెప్​ తయ్యిప్​ ఎర్డొగాన్​ ఏకపక్షంగా రద్దు చేశారు. ఎలక్షన్​లో ఆయన నాయకత్వంలోని ‘జస్టిస్ అండ్​ డెవలప్​మెంట్​ పార్టీ’ స్పల్ప తేడాతో ఓడిపోయింది. ఎక్రెమ్​ ఇమామోగ్లు నేతృత్వంలోని సెక్యులర్​ రిపబ్లికన్​ పీపుల్స్​ పార్టీ విజయం సాధించింది. స్వల్ప తేడాతో ఓడినా, భారీ లోటుతో ఓడినా ఓటమి ఓటమే కదా. ప్రెసిడెంట్​ రెకెప్​ తయ్యిప్​కి ఇదే రుచించలేదు. ఈ పరాజయం ఆయన ఇగోని దెబ్బతీసింది. ఓటమిని తట్టుకోలేకపోయిన ప్రెసిడెంట్​ రెకెప్​ తయ్యిప్ ఎర్డొగాన్ ఎన్నికల రద్దు నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా తన పార్టీయే నెగ్గాలనే మొండి పట్టుదలతో జూన్​ 23న మళ్లీ ఎన్నికలు జరిపాడు. ఈ నేపథ్యంలో తమ తీర్పును కాలరాయాలని చూసిన ప్రెసిడెంట్​ తీరును సిటీ ఓటర్లు తీవ్రంగా పరిగణించారు. ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పాలని తీర్మానించుకున్నారు. ముందుగానే ప్లాన్​ చేసుకున్న తమ ప్రోగ్రామ్​లను, సెలవులను క్యాన్సిల్​ చేసుకొని రీఎలక్షన్​లో​ రెట్టించిన ఉత్సాహంతో ఓటేశారు. అంతకుముందు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ప్రెసిడెంట్​ రెకెప్​ తయ్యిప్​ ఎర్డొగాన్​ పార్టీ రెండోసారి ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఆయన తిరుగులేని అధికారాన్ని చెలాయించే పరిస్థితి లేకుండా పోయింది.

చెక్​ రిపబ్లిక్​ ప్రధానికే చెక్ పెట్టారు.. ​

చెక్​ రిపబ్లిక్​ ప్రధానమంత్రి ఆంద్రెజ్​ బాబిస్​​ వర్కింగ్​ స్టైల్​ కూడా అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్ మాదిరిగానే ఉంటుంది. ట్రంప్​ లాగే ఆయనా బిలియనీరే. ఎన్నో స్కాంలకు పాల్పడ్డాడు. తన హోటల్​ ప్రాజెక్టుల్లో ఒకదానికి ఇల్లీగల్​గా యూరోపియన్​ యూనియన్​ బడ్జెట్​ నుంచి సబ్సిడీ ఇప్పించారు. ఈ కేసులో ఆయన్ని పోలీసులు ప్రాసిక్యూట్​ చేయటానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కొత్తగా న్యాయ శాఖ మంత్రిని నియమించారు. దీంతో కేసు ఇన్వెస్టిగేషన్​ని పొలిటికల్​గా ప్రభావితం చేయటానికి ఇన్​డైరెక్ట్​గా ప్రయత్నించారు. దీనిపై ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. రాజధాని ప్రాగ్​లో లెట్నా పార్క్​ వద్ద రెండున్నర లక్షల మంది నిరసన చేపట్టారు. ‘ప్రభుత్వం డెమొక్రటిక్​గా వ్యవహరించాల్సిందే. లేకుంటే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు. చెక్​ రిపబ్లిక్​లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 30 ఏళ్ల తర్వాత (1989 వెల్​వెట్​ రెవల్యూషన్​ అనంతరం) ఇంత భారీ ఎత్తున ర్యాలీ జరగటం ఇదే మొదటిసారి. దీంతో ఇప్పటి వరకూ ప్రధానిగా ఆంద్రెజ్​ బాబిస్​కు ఎదురే లేదనుకున్న పరిస్థితి కాస్తా తలకిందులైంది. ఆయన రాజీనామా చేయాలంటూ సెంట్రల్​, ఈస్టర్న్​ యూరోప్​లో డిమాండ్లు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

సూడాన్​ డిక్టేటర్​ ఒమర్​ అల్​ బషిర్​ 30 ఏళ్ల పాలనకు తెర

సూడాన్​లో నిత్యావసర సరుకుల రేట్లు భారీగా పెరగటంతో ప్రజలకు లివింగ్​ కాస్ట్​ తడిసి మోపెడవుతోంది. ధరలు అదుపు చేయాలని కోరుతూ జనం గతేడాది చివరలో ఉద్యమం ప్రారంభించారు. ఈ పోరాటం ఆ దేశాన్ని 30 ఏళ్లుగా డిక్టేటర్​లా ఏలుతున్న ఒమర్​ అల్​ బషిర్​ పాలనకు తెర దించింది. ముందుగా ప్రభుత్వ పాలనాధికారాన్ని ఆర్మీ తన చేతుల్లోకి తీసుకుంది. తర్వాత సివిలియన్​ అడ్మినిస్ట్రేషన్​కి అధికారాలను అప్పగించేందుకు మొండికేసిన ప్రెసిడెంట్​ ఒమర్​ అల్​ బషిర్​ని ఆ పదవి నుంచి తప్పించింది. అతనిపై అప్పటికే ఇంటర్నేషనల్​ క్రిమినల్​ కోర్టు హత్యాభియోగాలు మోపింది. దార్​ఫర్​ ప్రాంతంలో 118 మంది ఆందోళనకారులను కాల్చి చంపినందుకు, 70 మందిని రేప్​ చేసినందుకు ఈ చర్య చేపట్టింది. గత నెల 3న జరిగిన ఈ హత్యాకాండ అనంతరం సూడాన్​ ప్రజలు పట్టరాని కోపంతో ప్రభుత్వంపై తిరగబడ్డంత పని చేశారు. తమకు ఈ డిక్టేటర్​ పాలన నుంచి విముక్తి కల్పించాలని; స్వేచ్ఛ, శాంతి​, న్యాయం​ కావాలని కోరుతూ లక్షల సంఖ్యలో నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. ఆ దేశంలో ఈ స్థాయిలో ఆందోళనలు జరగటం ఇదే తొలిసారి.

హాంకాంగ్​లో హడలెత్తించారు..

హాంకాంగ్​ నాలుగు నెలలుగా ఆందోళనలు, అల్లర్లతో ఉడికిపోతోంది. నేరారోపణలు వచ్చిన నగరం  పౌరులను చైనా కోర్టుల్లో విచారించాలని లోకల్​ గవర్నమెంట్​ ప్రపోజ్​ చేసిన బిల్లుపై హాంకాంగ్​ ఎదురుతిరిగింది. ఈ బిల్లును వ్యతిరేకించేవారి సంఖ్య క్రమంగా వేల నుంచి లక్షలకు చేరింది. మార్చిలో 12 వేల మందితో మొదలైన ఈ మూమెంట్​లో ఏప్రిల్ నాటికి  లక్ష మందికి పైగా చేరారు. జూన్​లో అనూహ్యంగా పది లక్షల నుంచి 20 లక్షల మందికి పెరిగారు. సిటీలోని మొత్తం పాపులేషనే 75 లక్షలు కాగా అందులోని ప్రతి ఇద్దరు యూత్​లో ఒకరు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో రీసెంట్​గా పెద్దఎత్తున హంస చెలరేగింది. బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ముఖానికి ముసుగులు వేసుకొని, తలకు హెల్మెట్​ పెట్టుకొని సిటీ లెజిస్లేటివ్​ చాంబర్​లోకి దూసుకెళ్లారు. బ్రిటిష్​ పాలన ముగిసి హాంకాంగ్​ను తిరిగి చైనాకు అప్పగించి 22 ఏళ్లయిన రోజే ఈ ఇన్సిడెంట్​ జరిగింది. అనుమానం ఉన్న నేరస్తులను చైనాకు అప్పగించటానికి వీలు కల్పించే బిల్లును విత్​డ్రా చేసుకోవాలని ప్రజలు భారీఎత్తున రోడ్ల మీదికి వచ్చి మరీ నిరసనలు తెలిపారు. దీంతో హాంకాంగ్​ సర్కారు వెనక్కి తగ్గి బిల్లును తాత్కాలికంగా నిలిపేసింది.