హైదరాబాద్ లో సెంచరీకి చేరువైన పెట్రోల్ రేటు

హైదరాబాద్ లో సెంచరీకి చేరువైన పెట్రోల్ రేటు

పెట్రోల్, డీజిల్ రేట్ల మోత కంటిన్యూ అవుతోంది. ఇవాళ కూడా రేట్లు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. నెలరోజుల్లో ఏకంగా 22 సార్లు ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రేటు సెంచరీకి దగ్గరైంది. పెరిగిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 99 రూపాయల 31 పైసలకు పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్ ధర 95 రూపాయల 56 పైసలకు చేరింది. 

కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ఇప్పటికే సెంచరీ కొట్టేసింది. ముంబైలో లీటర్ పెట్లోల్ ధర 101 రూపాయల 76 పైసలకు పెరిగింది. రాజస్థాన్ లో లీటర్ పెట్రోల్ రేట్లు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. అక్కడ లీటర్ పెట్రోల్ రేటు 106 రూపాయల 64 పైసలుంది. పెరుగుతున్న రేట్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. కరోనా, లాక్ డౌన్లతో తీవ్రంగా నష్టపోయామన్నారు. దీనికి తోడు పెట్రోల్ రేట్ల పెంపు ప్రాణం మీదికి వస్తోందంటున్నారు.