ఫేజ్‌‌ గడుస్తున్న కొద్దీ మోడీ గ్రాఫ్‌‌ పైపైకి

ఫేజ్‌‌ గడుస్తున్న కొద్దీ  మోడీ గ్రాఫ్‌‌ పైపైకి

ఈ లోక్​సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. ఒక్కో రౌండ్​​లోనూ పోలింగ్​ జరిగిన సెగ్మెంట్ల సంఖ్య మారుతూ వచ్చింది. కానీ.. మొన్న వెలువడిన ఫలితాలను ఆయా ఫేజ్​ల​ వారీగా, పార్టీల వారీగా పరిశీలిస్తే ప్రధాని మోడీకి ప్రజల మద్దతు అంతకంతకూ పెరిగింది. ఆ గ్రోత్​ ఆరో విడత వరకూ అలాగే కొనసాగింది. మొదటి దఫాతో పోల్చితే రెండో దశలో కమలదళం ఓట్​ షేర్ 1.9 శాతం పెరిగింది. మూడో ఫేజ్​లో అది 3.7 శాతానికి చేరింది. తర్వాత 6.5 శాతం నుంచి ఆరో దశలో ఏకంగా 12.8 శాతానికి వెళ్లింది.  ఏడో దఫాలో మాత్రం పంజాబ్​లో కాంగ్రెస్​ పార్టీ కాస్త పుంజుకోవటంతో కమలనాథులకు ఓట్ల వాటా 7.6 శాతమే పెరిగింది. మూడో విడతలో హస్తం పార్టీకి కూడా ఓట్​ షేర్​ 1.9 శాతం పెరిగినా ఏడో ఫేజ్‌‌లో తప్ప మిగతా అన్ని దశల్లోనూ పడిపోయింది.