గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున నాకాబందీ నిర్వహించారు. స్థానిక ఫైవింక్లయిన్ చౌరస్తా ఏరియాలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ ఎం.రమేశ్ వాహనాలను చెక్ చేశారు. అలాగే తిలక్నగర్, రమేశ్నగర్, జవహర్నగర్, ద్వారకానగర్, పరుశురామ్నగర్, తదితర ప్రాంతాల్లోనూ కార్డెన్ సెర్చ్ చేపట్టారు.
డాక్యుమెంట్లు లేని వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించారు. డీసీపీ మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడేందుకు నాకాబందీ నిర్వహించినట్టు తెలిపారు. వన్టౌన్సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
