నితీశ్ నిజాయతీపరుడే కావొచ్చు.. ఆయన మంత్రులు దోచుకుంటున్నరు: ప్రశాంత్ కిశోర్

నితీశ్ నిజాయతీపరుడే కావొచ్చు.. ఆయన మంత్రులు దోచుకుంటున్నరు: ప్రశాంత్ కిశోర్

పాట్నా: బిహార్​సీఎం నితీశ్​కుమార్​నిజాయతీపరుడే కావొచ్చు కానీ ఆయన కేబినెట్‎లోని మంత్రులు దోచుకుంటున్నారని, రాష్ట్రాన్ని ఆగం పట్టిస్తున్నారని జన్​సురాజ్​పార్టీ చీఫ్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్​ప్రశాంత్​కిశోర్​వ్యాఖ్యానించారు. త్వరలో జరగనున్న బిహార్​అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న ప్రశాంత్​కిశోర్.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆదివారం ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ‘‘బిహార్‎లో అధికారంలో ఉన్న బీజేపీ, జేడీయూ కూటమి రాష్ట్రాభివృద్ధిని విస్మరించింది. సీఎం నితీశ్​ నిజాయితీపరుడే కావొచ్చు.. కానీ, ఆయన చుట్టూ ఉన్న మంత్రులు మాత్రం పేదలను నిలువునా దోచుకుంటున్నారు. 

ఈ విషయాన్ని పేదల వద్దకు వెళ్లినప్పుడు వాళ్లే చెప్తున్నారు” అని అన్నారు. తాను మూడేండ్ల నుంచి రాష్ట్రంలో పర్యటిస్తున్నానని.. ప్రజల బాధలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నానని ప్రశాంత్​ కిశోర్​పేర్కొన్నారు. ‘‘బిహార్‎లోని వాస్తవ పరిస్థితిని అందరి ముందుంచుతున్న. కొందరు అధికారులు, మంత్రులు కలిసి ప్రజలను లూటీ చేస్తున్నరు. వేల కోట్లు దోచేస్తున్నరు. ఇలాంటి అవినీతిని ఇంతకుముందెన్నడూ చూడలేదని జనమే చెప్తున్నరు” అని ఆయన తెలిపారు.