చెన్నూరు సీటు సీపీఐకి ఇవ్వొద్దు

చెన్నూరు సీటు సీపీఐకి ఇవ్వొద్దు
  • కాంగ్రెస్​కు కేటాయించకపోతే రాజీనామా చేస్తాం
  • కండ్లకు గంతలు కట్టుకొని నిరసన 

కోల్​బెల్ట్, వెలుగు: కాంగ్రెస్​అధిష్ఠానం చెన్నూరు అసెంబ్లీ సీటును సీపీఐకి కేటాయించనున్నట్లు సమాచారం ఉండటంతో కాంగ్రెస్ ​శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం రామకృష్ణాపూర్​లోని రాజీవ్ ​చౌక్​ వద్ద ఉన్న రాజీవ్​ గాంధీ విగ్రహం ఎదుట కండ్లకు గంతలు కట్టుకొని దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ​పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు ఉందని, నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ ​అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

పొత్తుల్లో భాగంగా చెన్నూరు సీటును సీపీఐకి కేటాయించడం సరికాదన్నారు. పార్టీ పునరాలోచించి కాంగ్రెస్​కు కేటాయించాలని.. లేకపోతే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ టౌన్​ ప్రెసిడెంట్ పల్లె రాజు, పీసీసీ జనరల్​ సెక్రటరీ రాఘునాథ్​ రెడ్డి, డీసీసీ వైస్​ప్రెసిడెంట్​ పుల్లూరి లక్ష్మణ్, మందమర్రి మండల ప్రెసిడెంట్ నీలయ్య, లీడర్లు రవి, భూమేశ్, శ్రావణ్​కుమార్, కొప్పర్తి నవీన్ తదితరులు పాల్గొన్నారు.