జబర్దస్త్ కామెడియన్ రాకింగ్ రాకేష్, నటి జోర్దార్ సునీత ఎంగేజ్ మెంట్ జరిగింది. గత కొంత కాలంగా ప్రేమలో మునిగిపోతున్న ఈ జంట ఇవాళ నిశ్చితార్థం జరుపుకున్నారు. బంధు మిత్రుల సమక్షంలో కాబోయే వధూవరులిద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు ఏపీ మంత్రి రోజా,యాంకర్ అనసూయ, రవి, అదిరే అభి, చలాకీ చంటి, గెటప్ శ్రీను దంపతులు, పలువురు జబర్దస్త్ కామెడియన్లు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్న రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత.. పెళ్లి డేట్ ను మరి కొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు. ఇటీవలే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు సుజాత చెప్పింది. తమ పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని యూ ట్యూబ్ చానల్ లో చెప్పింది.
జోర్దార్ సునీత, టీవీ యాంకర్ గా, న్యూస్ రీడర్ గా పేరుతెచ్చుకుని బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యింది. జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ తో కలిసి స్కిట్ లు చేసి ప్రేమలో పడింది..అలా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెడుతోంది.