
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ లెండర్ ఆర్బీఎల్ బ్యాంక్కు ఆర్బీఐ రూ.2.27 కోట్ల ఫైన్ వేసింది. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల గురించి ఇచ్చిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు ఈ చర్య తీసుకుంది. 2018–-19 నుండి 2021–22 ఆర్థిక సంవత్సరాల్లో ముంబైకి చెందిన ఈ బ్యాంక్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను వేధించినట్టు ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన సెంట్రల్ బ్యాంక్.. ఆర్బీఎల్ రూల్స్ను పాటించలేదని గుర్తించింది. లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు లేదా వేధింపులకు పాల్పడకుండా ఆపడంతో బ్యాంకు విఫలమైందని, వారిని నియమించే ముందు పోలీసు వెరిఫికేషన్ చేయించలేదని పేర్కొంది. ఏజెంట్లు ఎలాంటి బెదిరింపులకు లేదా వేధింపులకు పాల్పడకుండా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఆర్బీఐ పోయిన ఏడాది ఒక సర్క్యులర్ను జారీ చేసింది. ఇదిలా ఉంటే, ఆర్బీఎల్ బ్యాంక్ డిసెంబర్ క్వార్టర్లో రూ.209 కోట్ల నికర లాభం సాధించింది. 2021–-22 అక్టోబర్–-డిసెంబర్ క్వార్టర్లో రూ.156 కోట్ల లాభాన్ని సంపాదించింది. మొత్తం ఆదా రూ.1,767 కోట్లకు చేరుకుంది.