న్యూఢిల్లీ: పేటీఎం, ఫోన్పే వారి ప్లాట్ఫారమ్లను ఉపయోగించి యుటిలిటీ బిల్లులను చెల్లిస్తే ఇది వరకు క్యాష్బ్యాక్లు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.ఇక నుంచి ఈ యాప్లు తమ కస్టమర్ల మొబైల్ నంబర్లను రీఛార్జ్ చేయడానికి, కరెంటు బిల్లులు చెల్లించడానికి ప్లాట్ఫారమ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించాయి. యూపీఐ, క్రెడిట్కార్డ్, డెబిట్కార్డ్.. ఇలా ఏ విధంగా డబ్బు కట్టినా రీఛార్జ్లు/బిల్ చెల్లింపుల కోసం ఫోన్పేని ఉపయోగిస్తే ప్లాట్ఫారమ్ చార్జీ కట్టాలి. ఇందులోనే జీఎస్టీ కూడా ఉంటుంది.
మొబైల్ రీఛార్జ్ విఫలమైతే, చెల్లించిన రీఛార్జ్ మొత్తం (జీఎస్టీతో సహా)తో పాటు ప్లాట్ఫారమ్ చార్జ్ రీఫండ్ అవుతుంది. పేటీఎం యాప్ని ఉపయోగించి మీ మొబైల్ నంబర్ను రీఛార్జ్ చేయడానికి, ప్రతి మొబైల్ రీఛార్జ్కు రూపాయి చొప్పున ప్లాట్ఫారమ్ చార్జ్ విధిస్తారు. ఫోన్పే యాప్ రూ.రెండు వసూలు చేస్తున్నది. ఉదాహరణకు ఎయిర్టెల్ రూ. 296 మొబైల్ రీఛార్జ్ ప్యాక్ కావాలంటే పేటీఎం యాప్లో రూ. 297 చెల్లించాలి. ఫోన్పే యాప్లో అయితే రూ. 298 ఖర్చు అవుతుంది. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఛార్జ్ చేస్తామని ఈ యాప్స్ చెబుతున్నాయి. భవిష్యత్లో మరింత మందికి చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి.