64 ఎంపీ కెమెరా సెన్సార్‌ తో.. రెడ్ మీ కొత్త స్మార్ట్ ఫోన్

64 ఎంపీ కెమెరా సెన్సార్‌ తో.. రెడ్ మీ కొత్త స్మార్ట్ ఫోన్

చైనా స్మార్ట్‌ ఫోన్ తయారీదారు షావోమి అనుబంధ సంస్థ రెడ్‌ మి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ ను లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని చైనా తన అధికారిక సోషల్‌మీడియా వైబో అకౌంట్ లో కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది.  64 ఎంపీ కెమెరా సెన్సార్‌ తో ఈ స్మార్ట్‌ ఫోన్‌ ను లాంచ్‌ చేయనున్నట్లు తెలిపింది. రెడ్‌ మి 64 ఎంపీ కెమెరా స్మార్ట్‌ ఫోన్‌ లో బ్యాక్ సైడ్ నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. ఒక కెమెరా 64 ఎంపీ అనే విషయం తెలుస్తోంది. మిగతా మూడు కెమెరాల్లో ఎలాంటి సెన్సర్లు ఉంటాయో చూడాలి. ధర ఇతర ఫీచర్ల వివరాలను రెడ్‌ మి తెలుపలేదు. వీటి పేర్లు రెడ్‌ మి నోట్‌ 8, రెడ్‌మి కే30గా ఉండొచ్చనేది మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. రియల్‌ మి, శాంసంగ్‌ కొత్త ఫోన్లకు ఇది గట్టిపోటీ ఇవ్వనుందని మొబైల్ రంగం చెబుతోంది.

64 ఎంపీ కెమెరా సెన్సార్ తో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ పై అంచనాలు మాత్రం భారీగానే పెరుగుతన్నాయి. ఈ న్యూస్ తెలిసినప్పట్నుంచీ వెయిటింగ్ అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.