రెవెన్యూ రూ. 29,931 కోట్లు
న్యూఢిల్లీ: కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి లాభం సెప్టెంబర్ 2022 క్వార్టర్లో నాలుగింతలైంది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లోని రూ. 475 కోట్ల నుంచి ఈ లాభం ఈ సెప్టెంబర్ క్వార్టర్లో రూ. 2,061 కోట్లకు పెరిగింది. ఆదాయం కూడా 46 శాతం గ్రోత్తో రూ. 29,931 కోట్లకు చేరింది. అమ్మకాలు తాజా క్వార్టర్లో 36 శాతం ఎక్కువై 5,17,395 యూనిట్లకు చేరినట్లు మారుతి సుజుకి వెల్లడించింది. ఇంతకు ముందు ఏ క్వార్టర్లోనూ ఇంత ఎక్కువ సేల్స్ రికార్డు కాలేదని పేర్కొంది. దేశీయ అమ్మకాలు 4.54 లక్షల యూనిట్లయితే, ఎగుమతులు 63,195 యూనిట్లని మారుతి సుజుకి తెలిపింది.
డిమాండ్ పుంజుకోవడంతో అమ్మకాలు పెరిగాయని, ఫలితంగా కెపాసిటీ యుటిలైజేషన్ మెరుగై లాభదాయకత పెరిగిందని కంపెనీ పేర్కొంది. కస్టమర్ల నుంచి వచ్చిన ఆర్డర్లలో 4.12 లక్షలు పెండింగ్లో ఉన్నాయని, ఇందులో 1.3 లక్షల ఆర్డర్లు తాజాగా లాంఛ్ చేసిన మోడల్స్ కోసమే వచ్చాయని మారుతి సుజుకి వివరించింది. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కొరత వెంటాడుతున్న కారణంగా 35 వేల వెహికల్స్ ప్రొడక్షన్ ఎఫెక్టయినట్లు వెల్లడించింది.