- అక్కడ ఎలాంటి హెచ్చరిక లేకుండా టెర్రర్ అటాక్స్ జరగవచ్చు
వాషింగ్టన్: పాకిస్తాన్కు ప్రయాణంపై పునరాలోచించుకోవాలని అమెరికా.. తమ దేశ పౌరులకు సూచించింది. అక్కడ ఎలాంటి హెచ్చరిక లేకుండా ఉగ్ర దాడులు జరగవచ్చని హెచ్చరించింది. క్రైమ్ , హింస, టెర్రరిజం, కిడ్నాప్ వంటి భద్రతా సమస్యలు ఉండొచ్చని వెల్లడించింది.
రవాణా కేంద్రాలు, హోటళ్లు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సైనిక భద్రతా ప్రదేశాలు, విమానాశ్రయాలు, రైళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రార్థనా స్థలాలు, పర్యాటక ప్రదేశాలు ఎక్కడైనా ఆ బాంబు దాడులు జరగవచ్చని, ప్రయాణాలపై ఒకసారి పునరాలోచించుకోవాలని సూచించింది.
ఈ మేరకు ఈ వారం ప్రారంభంలో యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్.. లెవల్ 1 నుంచి లెవల్ 4 వరకు ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేసింది. పాకిస్తాన్ను ‘లెవల్ 3’ కేటగిరీ కింద ఉంచింది. ఇది అధిక టెర్రర్అటాక్ల ప్రమాదాన్ని సూచిస్తుంది.
బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కొన్ని ప్రాంతాలను లెవల్ 4 కింద పేర్కొంది. ఆ ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణించవద్దని అమెరికన్లను హెచ్చరించింది.
