ప్రజ్ఞాపూర్ వద్ద కంటైనర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ప్రజ్ఞాపూర్ వద్ద కంటైనర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

సిద్దిపేల జిల్లాలోని గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ(సోమవారం) ఉదయం వేములవాడ నుంచి వస్తున్న  ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ప్రజ్ఞాపూర్ చేరుకోగానే జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద క్రాస్ అవుతున్న కంటైనర్ ను ఢీ కొట్టింది.  ఈ ఘటనలో బస్సులో ఉన్న దాదాపు 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే గాయాలైన వారిని గజ్వేల్‌ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.