ఉక్రెయిన్ పై గత నెల 24న రష్యా యుద్ధానికి దిగింది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని అనేక సిటీలను రష్యా బలగాలు తమ చేతిలోకి తెచ్చుకున్నాయి. అయితే రాజధాని కీవ్ నగరాన్ని కూడా చుట్టుముట్టినప్పటికీ ఉక్రెయిన్ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండడంతో రష్యా సైన్యం లక్ష్యం నెరవేరడం లేదు. యుద్ధం మొదలుపెట్టిన సమయంలో తమ టార్గెట్ ఉక్రెయిన్ ను సైనిక రహితంగా చేయమేనని, తాము సైన్యం, సైనిక స్థావరాలపైనే దాడులు చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అయితే పోనుపోనూ ఉక్రెయిన్ లోని ఆస్పత్రులు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్, అపార్ట్ మెంట్లపైనా రష్యా ఆర్మీ దాడులు చేస్తోందని, వందల వేల మంది సామాన్యుల ప్రాణాలను బలి తీసుకుంటోందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యాలోని సామాన్యులు మొదలు పౌర సంఘాలు, జర్నలిస్టులు కూడా స్వదేశం తీరును ఖండిస్తున్నారు. పుతిన్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అలా నిరసనలు చేసిన వారిని అరెస్టు చేస్తూ వచ్చిన రష్యా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యన్ ఆర్మీపై తప్పుడు సమాచారం ప్రచురించినందుకు ఓ జర్నలిస్ట్ పై పుతిన్ సర్కారు క్రిమినల్ కేసు పెట్టింది.
Russia opens criminal case against journalist over 'false' info on Russian army: AFP News Agency
— ANI (@ANI) March 22, 2022