గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం.. భారీగా వ్యాపించిన పొగలు

గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం.. భారీగా వ్యాపించిన పొగలు

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. పాఠశాల సిబ్బంది చెత్తపేపర్లకు నిప్పు పెట్టడంతో.. హాస్టల్ ఆవరణలో ఉన్న గడ్డి, చెట్లు అంటుకొని ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా పొగలు వ్యాపించాయి. ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఒక్కసారి మంటలు చెలరేగడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. 

ALSO READ :- NZ v AUS: ఆసీస్ ఆటగాడు భారీ సెంచరీ.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

భారీగా వ్యాపించిన పొగలను చూసి చుట్టు ప్రక్కల స్థానికులు చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారాన్ని అగ్ని మాపక సిబ్బంది అందజేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. పాఠశాలకు చేరుకున్న పోలీసులు అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.