సంగారెడ్డిలోని మెడికల్ కాలేజీ పరిశీలన

 సంగారెడ్డిలోని మెడికల్ కాలేజీ పరిశీలన

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధన ఆసుపత్రుల్లో మౌలిక వసతుల మెరుగు కోసం నాణ్యమైన విద్యను స్టూడెంట్స్ కు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు మెడికల్ కాలేజీల పర్యవేక్షణ కమిటీని నియమించగా బుధవారం వారు పరిశీలించారు. జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ నిబంధనల మేరకు ఆసుపత్రిలో కావాల్సిన సౌలతుల  ప్రతిపాదనలు రూపొందించినట్లు డ్రగ్స్ కంట్రోల్ అడ్మిన్ డీజీ  ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు. 

 ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్, ఐసీయూ, విద్యార్థుల తరగతి గదులను, ల్యాబ్, హాస్టల్ గదులను పరిశీలించారు. ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కాలేజీ ప్రిన్సిపాల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ లకు ఆదేశించారు. డైరెక్టర్ జనరల్ డీసీఏ నేతృత్వంలో కలెక్టర్  పి. ప్రావీణ్య, డీఎంఈ  నుంచి విమల తామస్ , అసిస్టెంట్ డీఎంఈ  డాక్టర్ వాణి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధా మాధురి మెడికల్ కాలేజీల పర్యవేక్షణ కమిటీ సభ్యులు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్, ఆర్‌‌అండ్‌బీ డీఈ రవీందర్ రెడ్డి , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.