ఎస్బీఐ గుడ్ న్యూస్.. రెండేళ్లు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు

ఎస్బీఐ గుడ్ న్యూస్.. రెండేళ్లు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు

ఎస్బీఐ లో లోన్ తీసుకున్న కస్టమర్లకు గుడ్ న్యూస్ . లోన్ రీ కన్ స్ట్రక్చరింగ్ స్కీమ్ కింద 24 నెలలు (ఈఎంఐ)మారటోరియం స్కీంను ప్రకటించింది ఎస్బీఐ. హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, వెహికిల్, ఎడ్యుకేషన్ లోన్లు తీసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. అది కూడా 2020 మార్చి 1 లోపు లోన్ తీసుకుని ఉండాలి. లోన్ రీ స్ట్రక్చరింగ్ ఆప్షన్ ను ఎంచుకున్న వారు అదనంగా 0.35 శాతం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.  కరోనా సంక్షోభం వల్ల ఆదాయం దెబ్బతిన్న కస్టమర్లకే ఇది వర్తిస్తుంది.  ఆదాయంపై కరోనా ప్రభావం  లేకుంటే ఎప్పటిలాగే ఈఎంఐలు కట్టుకోవాలి.  దీని కోసం ఎస్బీఐ పోర్టల్ లోకి వెళ్లి బ్యాంక్ అకౌంట్  నంబర్ వివరాలు ఎంటర్ చేసి అప్లై చేసుకోవాలి.  2020 డిసెంబర్ 24 లోపే అప్లై చేసుకోవాలి.

For More News..

వీడియో తీయమని లైవ్‌లో నదిలోకి దూకిన వ్యక్తి

వీడియో: తనపై దాడికి యత్నించిన ఎంపీలకు టీ అందించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

తెలంగాణలో మరో 2,166 కరోనా కేసులు