దేశ రాజధానిలో స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. నవంబర్ 1 నుంచి ఢిల్లీలోని అన్ని స్కూళ్లలో క్లాంపస్ క్లాసులు మొదలవుతాయన్నారు. పిల్లల్ని బడులకు పంపే విషయంపై పేరెంట్స్ను బలవంతం చేయబోమని స్పష్టం చేశారు. అదే సమయంలో క్లాసులకు హాజరు కాలేని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు కొనసాగుతాయన్నారు.
All the schools and educational institutes shall be allowed to be opened, for all the classes, in Delhi from 1st Nov.
— Manish Sisodia (@msisodia) October 27, 2021
However, schools shall also continue online classes for the students who are not willing to attend classes offline.
పిల్లల్ని స్కూళ్లకు తప్పనిసరిగా పంపాలని తల్లిదండ్రులను బలవంతం చేయొద్దని నిపుణులు సూచించినట్లు సిసోడియా తెలిపారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలన్నారు. అలాగే సింగిల్ డోసు టీకా తీసుకున్న వారికి త్వరగా రెండో డోసు కూడా ఇప్పించాలని ఆదేశించారు. 6 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు స్కూళ్లు రీఓపెన్ చేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) ప్యానెల్ సూచనల తర్వాతే ఆప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.