
చేగుంట, వెలుగు: జాతీయ స్థాయి అండర్ 18 రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి ఏడుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు శనివారం జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కర్ణం గణేశ్ రవికుమార్, మల్లీశ్వరి తెలిపారు. మండల కేంద్రంలోని ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ కు చెందిన నందిని, దీపిక, సంపూర్ణ, స్టాండ్ బై గా అంకిత ఉన్నారు. బాలుర విభాగంలో తూప్రాన్ లోని బాలుర గురుకుల కాలేజీకి చెందిన విష్ణు శ్రీ చరణ్, రాకేశ్, కార్తీక్ స్టాండ్ బై గా సెలెక్ట్ అయ్యాడు.
బాలికల పోటీలు ఈనెల 8 నుంచి 10 వరకు, బాలురు ఈ నెల 12 నుంచి 14 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో జరిగే జాతీయస్థాయి రగ్బీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు మెదక్ జిల్లా టీమ్కు కోచ్లుగా నవీన్, రంగీలా వ్యవహరించారు. జిల్లా నుంచి క్రీడాకారులు ఎంపికైనందుకు చేగుంట స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ సుమతి రజిత, తూప్రాన్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ ప్రిన్సిపాల్ తారాసింగ్ హర్షం వ్యక్తం చేశారు.