
- సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి
జగదేవపూర్(కొమురవెల్లి), వెలుగు: నిరుపేదల సొంతింటి కల నెరవేరిందని మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జగదేవపూర్ మండలంలోని పీర్లపల్లి, మాదాపూర్, పలుగుగడ్డ, దౌలాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. నర్సారెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్నియోజకవర్గానికి ప్రభుత్వం 3500 ఇండ్లను కేటాయిస్తే ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో ఉంటూ ఎవరికి కేటాయిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
మండలంలోని లింగారెడ్డిపల్లెకు 77 ఇండ్లు మంజూరు కాగా 16 ఇండ్లకు పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఇండ్లు మంజూరై నిర్మాణ పనులు చేపట్టకపోతే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మహేందర్ రెడ్డి, కరుణాకర్, యాదగిరి, రాము, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహా రెడ్డి, అజీజ్, మల్లారెడ్డి , సుదర్శన్ రెడ్డి, సుధాకర్, ఏఓ వసంతరావు, ఎంపీడీవో రాంరెడ్డి, హౌసింగ్ ఏఈ విశాఖ, ఖాజా మోహినోద్దిన్, కార్యదర్శి ప్రవీణ్ పాల్గొన్నారు.
వెలికట్టలో ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభం
కొండపాక: మండలంలోని వెలికట్ట, సిరిసనగండ్ల గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మరిన్ని ఇందిరమ్మ ఇండ్ల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రి వివేక్ వెంకట స్వామిని కోరామని త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూమి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ పరుశరాములు మండల అధ్యక్షుడు లింగరావు, ఫ్యాక్స్ డైరెక్టర్ సురేందర్రావు, గజ్వేల్ సుదర్శన్, చిన్న శ్రీను, రాములు, శ్రీకాంత్, రాజు పాల్గొన్నారు.