- సంస్థకు శాశ్వత సీఎండీని నియమించాలి
- ప్రభుత్వ బకాయిలను వెంటనే చెల్లించాలి
- గుర్తింపు సంఘం ప్రెసిడెంట్సీతారామయ్య
గోదావరిఖని, వెలుగు : కొత్త గనులు వస్తేనే సింగరేణికి మనుగడ ఉంటుందని సంస్థ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రెసిడెంట్వి.సీతారామయ్య అన్నారు. కొత్త గనులను ప్రైవేటుకు ఇవ్వకుండా సింగరేణికి ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగిన మీటింగ్లో యూనియన్ జనరల్సెక్రటరీ రాజ్కుమార్తో కలిసి ఆయన మాట్లాడారు. సంస్థకు శాశ్వత సీఎండీని నియమించకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని వాపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే మారుపేర్లు, విజిలెన్స్ కేసులు, సొంతింటి పథకం అమలు, పెర్క్స్ పై ఇన్ కంటాక్స్ చెల్లింపు సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.47 వేల కోట్ల బకాయిలు వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్చేశారు. కాగా గుర్తింపు సంఘం కాలపరిమితి సెప్టెంబర్ 2026 వరకు ఉందని, కొన్ని కార్మిక సంఘాలు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనియన్ లీడర్లు మిర్యాల రంగయ్య, కె.సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, మడ్డి ఎల్లాగౌడ్, ఆరెల్లి పోషం, సంకె అశోక్, సిర్ర మల్లికార్జున్, తొడుపునూరి రమేశ్ కుమార్ పాల్గొన్నారు.
