
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్హాస్పిటల్ ఎదుట సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. రాజ్కుమార్మాట్లాడుతూ మెయిన్ హాస్పిటల్తో పాటు అన్ని ఏరియా హాస్పిటళ్లలో పేషెంట్లకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. రిటైర్డ్ కార్మికులకు రెండు నెలలకు అవసరమైన మందులను అందజేయాలని కోరారు. ఈ ప్రోగ్రాంలో యూనియన్ నేతలు వంగా వెంకట్, ఎస్వీ. రమణ మూర్తి, క్రిష్టఫర్, అనంతలక్ష్మి, సుష్మసిరి, రమేశ్, నితిన్, రాంశంకర్, నాగయ్య పాల్గొన్నారు.